ఘాటు అందాలతో రచ్చ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. 

Phani.ch

16 May 2024

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.

ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది.

2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. 

హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. 

ఈ భామ  హీరోయిన్‌గా నటించిన అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. 

ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది.  అయినా ఎందుకో ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

అఖండ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్లింది. ప్రగ్యాకు పెద్ద ఒరిగిందేమి లేదు. ఈ సినిమా సక్సెస్ అయినా.. అవకాశాల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

 ఆ మధ్య ‘మై చలా’ అనే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. కంచె మంచి సినిమాగా గుర్తింపు ఇస్తే.. అఖండ కమర్షియల్ సక్సెస్ అందించింది.