సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అప్‌డేట్.. క్రేజీ ఆలోచనలో ‘గుంటూరు కారం’ టీం..

TV9 Telugu

04 January 2024

సలార్ పార్ట్ 2 కోసం డార్లింగ్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు.

శౌర్యంగ పర్వం పేరుతో సలార్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీనిలో ప్రభాస్ మరింత వైలెంట్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే సలార్ రెండో భాగంగా వస్తున్న శౌర్యంగ పర్వంకి సంబంధించిన కొంత షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తుంది.

అయితే సలార్ 2 అప్డేట్ కోసం అభిమానులు వేచి చూస్తున్న తరుణంలో ఇంకొన్ని రోజులు ఆ ఎదురు చూపులు తప్పవని తెలుస్తుంది.

అత‌డు, ఖ‌లేజా తర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలున్నాయి.

సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల కావ‌డం మ‌రింత ప్లస్ కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి యుఎస్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చెప్తామన్నారు మూవీ మేకర్స్. సినిమా జనవరి 12న విడుదల కానుంది.