ప్రభాస్‌కు రేవంతన్న బంపర్ ఆఫర్

21 December 2023

TV9 Telugu

సలార్ మేనియా పీక్స్‌లో ఉంది. ఈ మూవీ టికెట్ల కోసం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్‌ హోరా హోరా గా పోటీ పడడం కనిపిస్తోంది.

ఇక దానికి తోడు... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...డార్లింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాయి.

టికెట్ల రేట్లను సలార్‌కు కలెక్షన్స్‌ను కలిసివచ్చేలా పెంచేందుకు అనుమతినిచ్చాయి.

తెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కో టికెట్‌పై 65 రూపాయిలు పెంచుకోవచ్చు.

మల్టీప్లెక్స్‌లో అయితే 100 రూపాయలు పెంచుకునేందుకు తాజాగా రేవంత్ ప్రభుత్వం సలార్ మేకర్స్‌కు అనుమతినిచ్చింది.

దీంతో ఈ మూవీ టికెట్ రేట్‌ సింగిల్ స్క్రీన్స్‌లో 253, మల్టిప్లెక్స్‌లలో 413కు చేరుకుంది.

ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్క సింగిల్ స్క్రీన్స్ లోనే.. ఉన్న టికెట్ రేట్‌పై 40 పెంచుకోవచ్చు సలార్ మూవీ మేకర్స్కు అనుమతినిచ్చింది.

దీంతో ఏపీలో సింగిల్ స్క్రీన్‌ రేట్ 165రూపాయలకు... చేరుకుంది. మల్టిప్లెక్స్ రేట్ 225గా యథాతథంగా ఉంది.

ఇక ఈ ఎక్స్‌ట్రా రేట్స్‌ ఏపీలో పది రోజులు.. తెలంగాణలో వారం రోజుల వరకే అమల్లో ఉండనుంది.