TV9 Telugu

21 January 2024

అయోధ్యకు 50కోట్లు, ప్రారంభోత్సవం భోజన ఖర్చుపై ప్రభాస్‌ టీం క్లారిటీ.

అయోధ్యలో రామ్‌లల్లా జనవరి22న అంగరంగవైభవంగా కొలువుదీరనున్న వేళ..

ఓ రెండు న్యూస్‌లు త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నాయి.

అందులో.. ప్రభాస్‌ అయోధ్యకు 50కోట్లను విరాళంగా ఇచ్చారనే న్యూస్ ఒకటి కాగా.,

ప్రారంభోత్సవం రోజు భోజనాల ఖర్చంతా ప్రభాసే భరిస్తున్నారనేది మరో న్యూస్.

అయితే ఈ న్యూస్‌లపైనే తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ టీం. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరింది.

అయితే రీసెంట్‌గా ఏపీ కోనసీమ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అయోధ్య ప్రారంభోత్సవంలో..

భోజనాల ఖర్చంగా ప్రభాసే భరిస్తున్నారంటూ చెప్పారు. దీంతో నేషనల్ మీడియా న్యూస్‌ ఫైల్ చేసింది.

అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవడంతో ప్రభాస్‌ టీం రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది.