ఆ కారణంతోనే గుంటూరు కారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది.: పూజా

టాలీవుడ్‌ బడా హీరోలు, పెద్ద బ్యానర్లో సినిమాలు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతుంటారు.

అందులోనూ రిపీట్‌ కాంబినేషన్స్లో సినిమాలు వస్తున్నాయంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.

మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం.

ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

త్రివిక్రమ్‌ తో రెండు సినిమాలు చేసిన పూజా హెగ్డే , ప్రస్తుత ట్రెండీ నటి శ్రీలీలను హీరోయిన్లా ప్రకటించిన సంగతి తెలిసిందే,

అయితే గుంటూరు కారం నుండి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

దీనిపై పూజా కూడా క్లారిటీ ఇచ్చిందట. తెలుగు, హిందీ సినిమాలతో మోస్ట్‌ బిజియెస్ట్‌ తారగా మారిపోయింది పూజా హెగ్డే.

దీనిపై ఆమె టీం స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నది వాస్తవమేనని టీం తెలిపింది.

గుంటూరు కారం సినిమా షూటింగ్‌ 'చాలా ఆలస్యం కావడమే కాకుండా ఇప్పటికీ ఒప్పుకున్న ఇతర సినిమా షూటింగులకు..

డేట్స్‌ అడ్డస్ట్‌ కాకపోవడంతోనే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలిపింది పూజా.