'గుంటూరు కారం' నుంచి పూజా ఔట్.. ఆ హీరోయిన్ కు ఛాన్స్..

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం  'గుంటూరు కారం'.

ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.

హారిక & హాసిని క్రియేషన్స్ పథకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ చిత్రంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి.

గతంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఈ చిత్రం నుంచి తప్పించారని రూమర్స్ ను కొట్టిపడేసింది చిత్రబృందం.

ఇదిలా ఉంటె గత రెండు రోజులుగా హీరోయిన్ పూజా హెగ్దేని ఈ చిత్రం నుంచి తీసేశారంటూ వార్త చెక్కర్లు కొడుతుంది.

పూజా హెగ్దే స్థానంలో సంయుక్త మీనన్‌ను తీసుకోనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.