తన పరువాలతో ఆ సముద్రానికి సెగలు పుట్టిస్తుందేమో ఈ వయ్యారి..

TV9 Telugu

15 April 2024

5 డిసెంబర్ 1992న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార పాయల్ రాజ్ ఫుట్.

ఈ బ్యూటీ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ అకౌంట్ టీచర్, తల్లి నిర్మల్ రాజ్‌పుత్. ధ్రువ్ రాజ్‌పుత్ అనే సోదరుడు కూడా ఉన్నాడు.

న్యూఢిల్లీ మహానగరంలోని ఉన్న DAV సెంటినరీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ వయ్యారి భామ.

ఓ ప్రముఖ కాలేజీలో యాక్టింగ్ డిప్లొమా చేసింది. ఢిల్లీలోనే గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల భామ.

నటి కావాలనే కల ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఆ కోరికతో 2012లో నటనలో తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.

ఆమె 'సప్నోన్ సే భరే నైనా', 'గుస్తఖ్ దిల్', 'ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై', 'మహాకుంభ్' వంటి టీవీ సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది.

2018లో కార్తికేయకి జోడిగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

తర్వాత తెలుగులో వరుస సినిమా చేసింది. 2023లో మంగళవారం సినిమాలో ప్రధానపాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.