27 October 2024

అలాంటి వ్యక్తికి మాత్రమే నా జీవితంలో చోటు.. నిత్యా మీనన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా తమిళంలోనే సినిమాల్లో నటిస్తుంది. 

ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. గతంలో వీరిద్దరు కలిసిన నటించిన తిరుచిత్రంబలం సినిమా భారీ హిట్ అయ్యింది. 

ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది నిత్యా. తాజాగా ఈ అవార్డ్ గురించి స్పందించింది. 

తనకు జాతీయ అవార్డ్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది. ప్రేమ పట్ల ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవని తెలిపింది. 

అయితే తనకు ఇప్పుడు ప్రేమ, పెళ్లి అంత ముఖ్యం కాదని.. ప్రస్తుతం తన కెరీర్ పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

ప్రేమ, పెళ్లికి కూడా టైమ్ వస్తుందని.. కానీ అదెప్పుడనేది చెప్పలేనని తెలిపింది. జీవితంలో ప్రేమకు అవకాశం లేదని కాదని తెలిపింది.

జీవితంలోకి ఎవరైనా రావాల్సిందేనని.. అది ఇప్పుడే పెళ్లి చేసుకో అనే మాటలు తాను నమ్మనని.. ప్రేమ, పెళ్లి పట్ల ఫ్లెక్సిబుల్‏గా ఉందట. 

అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే తన జీవితంలోకి వస్తాడని.. తాను వెతకడం లేదని.. జీవితం చాలా విషయాలతో ముడిపడి ఉందని తెలిపింది.