24 August 2024

ఆ స్టార్ హీరో సరసన నిత్యా మీనన్.. క్రేజీ కాంబో గురూ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

హీరోయిన్ అంటే గ్లామర్ షో కాదంటోంది హీరోయిన్ నిత్యా మీనన్. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటుంది ఈ అమ్మడు. 

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు రెడీ అంటుంది. 

ఇటీవలే ధనుష్ నటించిన తిరుచిత్రంబలం మూవీలో తన నటనకు ఉత్తమ నటిగా నిత్యా మీనన్ జాతీయ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఎంచుకున్న ప్రతీ పాత్రలోనూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన నిత్యా మీనన్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. పాండిరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారని.. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ కానుంది నిత్య. 

ఇందులో విజయ్ సేతుపతి జోడిగా నిత్యా మీనన్ కనిపించనుందని.. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. 

త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో కథానాయికగా పరిచయమైంది నిత్యా.