తన సొగసుతో చిరాకే సెగలు పుట్టిస్తున్న నేహా.. 

TV9 Telugu

27 August 2024

5 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి. పెరిగింది మాత్రం బెంగుళూరులోనే.

‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత 'గల్లీ బాయ్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితేనేం సరిగ్గా ఐదేళ్ల తర్వాత డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టింది.

రాధిక పాత్రలో నేహ శెట్టి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాత్ర ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో నేహ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి. రీసెంట్‌గా 'బెదురులంక 2021' మరో హిట్ దక్కించుకుంది.

గత ఏడాది కిరణ్ అబ్బవరంకి జోడిగా 'రూల్స్ రంజన్' సినిమాలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఈ ఏడాది సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్‎లో మరోసారి రాధికగా అదితి పాత్రలో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత  విశ్వక్‎సేన్ సరసన  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో హీరోయిన్‎గా నటించింది. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.