సోయగంలో నదితోనే పోటీపడుతున్న నేహా..

30 October 2023

6 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది అందాల తార నేహా శెట్టి. ఈమె తల్లి డెంటిస్ట్, తండ్రి బిజినెస్ మ్యాన్.

మోడలింగ్‌లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో కిరీటం గెలుచుకుంది.

2015లో మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నది ఈ వయ్యారి భామ. అందులోని రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.

2016లో దర్శకుడు శశాంక్ తెరకెక్కించిన ముంగారు మలే 2 అనే కన్నడ చిత్రంలో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ భామ.

2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా చిత్రంలో ఆకాష్ పూరికి జోడిగా తెలుగు తెరకు పరిచయం అయింది.

2021లో సందీప్ కిషన్ గల్లీ రౌడీ మూవీలో కథానాయకిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

2022లో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా డిజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల బెదులంక 2012, రూల్స్ రాజన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందు వచ్చింది ఈ వయ్యారి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటిస్తుంది.