ఇంకో లెవల్లో అల్లు అర్జున్‌ డెడికేషన్‌.. కోలీవుడ్‌లో జాన్వీ చెల్లి ఖుషీ..

26 November 2023

11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఆధ్యాత్మిక ప్రాంతం శృంగేరిలో జన్మించింది అందాల భామ నాభ నటేష్.

తన స్వస్థలమైన కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఓ పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

కర్ణాటకలోని ఉడిపిలో N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది.

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌ను ప్రారంభించింది.

కొద్దికాలం పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది. పాఠశాల, కళాశాల రోజుల్లో అనేక పోటీలలో తన ప్రతిభను చూపించింది.

ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు 2013లో టాప్ 11 జాబితాలో ఉంది. అంతేకాదు మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది.

అభినయ తరంగ వద్ద నటన శిక్షణ పొందింది ఈ బ్యూటీ. బెలవాడిలో థియేటర్ కెరీర్ ను ప్రారంభించింది ఈ వయ్యారి భామ.

2018లో నన్ను దోచుకుందువటే అనే చిత్రంతో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకుంది.