21 November 2023

పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెంచేసిన దేవి శ్రీ ప్రసాద్.. 

Pic credit - Instagram

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న  పుష్ప 2 కోసం  సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని అన్నారు. డీఎస్పీ కామెంట్స్ తో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. 

జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలెట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు దేవీ శ్రీ ప్రసాద్. 

ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని  అన్నారు. అలాగే నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని తెలిపారు. 

 ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‏లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని తెలిపారు డీఎస్పీ. గతంలో పుష్ప సినిమాలోని మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. 

ఇప్పటికే జాతర ఎపిసోడ్‏కు సంబంధించిన ఫస్‏లుక్ ఇఫ్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. గంగమ్మ తల్లిగా బన్నీ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు.