11 May 2025

రెమ్యునరేషన్ పెంచేసిన హీరోయిన్.. అందుకే ఆఫర్స్ రావడం లేదా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో మరింత క్రేజ్ వచ్చింది. 

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న మృణాల్.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్‏గా మారింది. 

ఆ తర్వాత నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. 

ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది మృణాల్. 

చేతిలో కేవలం ఒక్క సినిమాతోనే నెట్టుకోస్తున్న మృణాల్ కు.. ఇప్పుడు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ హిందీలో బిజీగా ఉంటుంది

అయితే తెలుగులో ఒక్క సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు తీసుకున్న పారితోషికం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ పెంచేసిందట. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ కొనసాగిస్తున్న మృణాల్.. అక్కడ మాత్రం ఒక్క సినిమాకు భారీగానే పారితోషికం అందుకుంటుందని సమాచారం. 

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్లకు పిచ్చెక్కేలా చేస్తుంది. మరీ తెలుగు అడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.