ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా దృశ్యం.. ఈగిల్ ఓటీటీ..
02 March 2024
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా దృశ్యం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
అలాగే కొరియాలోనూ దీన్ని రీమేక్ చేసారు. ఇక ఇప్పుడు హాలీవుడ్లో గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి ఇంగ్లీష్కు తీసుకెళ్తున్నారు.
ఇండియా నుంచి హాలీవుడ్లో రీమేక్ అవుతున్న మొదటి సినిమా ఇదే. త్వరలోనే దీని మూడో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వంశీ తుమ్మల, హారిక బల్లా జంటగా వినయ్ రత్నం తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ సాగు. 51 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ మూవీ మార్చి 4 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కానుంది.
వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రాన్ని ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్కు పంపించారు. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై నిర్మించారు.
రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఈగల్. అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించారు. కావ్య థాపర్ హీరోయిన్.
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్గా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. మార్చి 1న రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.