వారికీ అనుష్కతో మాట్లాడే అవకాశం..
14 September 2023
అనుష్క శెట్టి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ మూవీలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కధనాయకుడుగా నటించాడు.
ఈ చిత్రంతో రీయంట్రీ ఇచ్చింది స్వీటీ. పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
ఇదిలా ఉంటె సెప్టెంబర్ 14న (గురువారం) మహిళల కోసం తెలుగు రాష్టాల్లో కొన్ని థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ స్పెషల్ స్క్రీనింగ్ అయ్యే ప్రతి థియేటర్స్ లో ఇద్దరు లక్కీ మహిళలకు అనుష్కతో ఫోన్ కాల్ లో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది చిత్రబృందం.
దీనికోసం తీసుకున్న టికెట్స్ వెనుక వారి పేరు నెంబర్ రాసి, థియేటర్ లో ఏర్పాటు చేసిన డిప్ లో వేస్తే డ్రా తీయడం జరుగుతుంది.
ఆ డ్రాలో ఇద్దరు లక్కీ విన్నెర్స్ కి జేజమ్మతో మాట్లాడే అవకాశం వస్తుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మూవీ మేకర్స్.
ఇదిలా ఉంటె 2018లో భాగమతి బ్లాక్ బస్టర్ తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో నటించింది దేవసేన.
ప్రస్తుతం స్వీటీ తర్వాతి మూవీ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రంలో అనుష్క ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి