ఆరోజున ప్రేక్షకుల ముందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..

అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జోడిగా తెరకెక్కుతున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

పి. మహేష్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.

చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది.

ఇప్పటికే విడుదలైనా ఈ చిత్రం టీజర్, పోస్టర్,  సాంగ్స్‌ ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ఈ చిత్రాన్ని ఆగష్టు 4న ప్రేక్షకల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్.

ఈ మేరకు ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ కూడా కూడా విడుదల చేశారు.

కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.