తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో సడి పెంచేస్తున్న మిర్నాళిని రవి..

30 October 2023

10 మే 1995ను కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార మిర్నాళిని రవి.

2019లో తమిళ చిత్రం సూపర్ డీలక్స్ లో తొలిసారిగా నటించింది. తర్వాత ఛాంపియన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

2019లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ.

తరువాత విశాల్, ఆర్య మల్టీస్టార్ర్ర్ చిత్రం ఎనిమి సినిమాలో మమతా మోహన్ దాస్ తో పాటు మరో కథానాయకిగా నటించింది ఈ భామ.

ఎంజీఆర్ మగన్ అనే ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ వయ్యారి భామ. ఎం. శశి కుమార్ ఈ చిత్రంలో హీరో.

తర్వాత తమిళ సైన్స్ ఫిక్షన్ సినిమా జాంగోలో నిషా అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మిర్నాళిని రవి.

తర్వాత ఏడాదిలో సయ్యద్ సోహెల్ హీరోగా వచ్చిన రొమాంటిక్ ఫిలిం ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడులో కథానాయకిగా చేసింది.

ఇటీవల సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ లో తెరకెక్కిన మామా మశ్చేంద్ర సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ వయ్యారి.