25 February 2025

స్పెషల్ పాటలతోనే క్రేజ్.. 3 నిమిషాలకు 3 కోట్లు డిమాండ్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం ఆమె స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటివరకు కెరీర్ మొత్తంలో ఒక్క హిట్ మూవీ కూడా లేదు. కానీ 3 నిమిషాలకు మూడు కోట్లు తీసుకుంటుంది. 

అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. 

ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా. సినీరంగంలోకి రాకముందు అనేక అందాల పోటీలలో గెలిచింది ఈ వయ్యారి. కానీ ఇండస్ట్రీలో మాత్రం క్రేజ్ రాలేదు. 

హిందీ, తెలుగు భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇటీవలే డాకు మహారాజ్ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో సందడి చేసింది.

ఇందులో మూడు నిమిషాల పాట కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం తీసుకుందట ఈ వయ్యారి. ప్రస్తుత ఈ బ్యూటీ ఆస్తులు రూ.236 కోట్లు ఉన్నట్లు టాక్. 

అలాగే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్ స్టాలో ఈ వయ్యారికి ఏకంగా 73 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

2013లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ సరసన సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. 

సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ అంతగా ఆకట్టుకోలేదు. పదేళ్లల్లో ఒక్క హిట్ అందుకోలేదు.