హోస్ట్ గా మారిన మనోజ్.. త్వరలో షో స్టార్ట్..

11 December 2023

హీరోలను బిగ్ స్క్రీన్ మీద చూడటం కామన్.. కానీ వాళ్లే బుల్లితెరపైకి వస్తే అది సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తుంది.

మారిన కాలంతో పాటు హీరోలు కూడా మారుతూ బిగ్ స్క్రీన్‌తో పాటు డిజిటల్ వరల్డ్‌కూ ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా మంచు మనోజ్ కూడా అదే చేసారు. ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో హోస్ట్ గా వచ్చేస్తున్నారు.

ప్రముఖ ఓటిటి ఈటీవీ విన్ లో డిసెంబర్ 15 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని టీజర్ విడుదలైంది.

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇటీవల వాట్ ది ఫిష్ అనే ఓ సినిమాను అనౌన్స్ చేసారు. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతుంది.

ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే ఈ గేమ్ షోకు హోస్ట్‌గా సిద్ధమయ్యారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ చేస్తుంది.

ఈయన మాత్రమే కాదు.. విశ్వక్ సేన్ సైతం ఈ మధ్యే ఆహాలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ ధమాకా షోతో హోస్ట్ గా ఆకట్టుకుంటున్నారు.

వీళ్ళ కంటే ముందే సీనియర్ హీరోలు బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి, నాగ్ బిగ్ బాస్ షోకి హోస్ట్స్ గా చేస్తున్నారు.