మాళవిక నాయర్ కొత్త చిత్రం ప్రారంభం..

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది కేరళ కుట్టి మాళవిక నాయర్.

తర్వాత కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

ఈ చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇటీవల వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, అన్ని మంచి శకునములే చిత్రాలు నిరాశపరిచాయి.

ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది.

తాజాగా ఆమె మరో చిత్రం కూడా ప్రారంభం అయింది.

కన్నడ స్టార్‌ హీరో గణేష్‌కి జోడిగా 'కృష్ణం ప్రణయ సఖి' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది.

ఈ చిత్రాన్ని 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు తెరకెక్కిస్తున్నారు.

స్కిన్ షోకి దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.