16 December 2023

యానిమల్ 2 లో ఆ ఇద్దరు.. ఈసారి భారీగా.!

 డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు.

ఈ సినిమాకు సౌత్, నార్త్ అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

యానిమల్ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండడంతో ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకండ్ పార్ట్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది.

తాజాగా వినిపిస్తోన్న సమాధానం ప్రకారం.. రెండో భాగంలో హీరోయిన్‏గా మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు తెలుస్తోంది, అంతేకాకుండా విలన్‌గా బాలీవుడ్ టాప్ హీరోను తీసుకుంటారని సమాచారం