TV9 Telugu

06 January 2024

రన్ టైం తో లాక్ చేసిన మహేష్ బాబు మాస్ అవతార్‌తో పూనకాలు పక్కా.

తెలుగు సినీ పరిశ్రమ అంతటా ఇప్పుడు 'గుంటూరు కారం' ప్రమోషన్స్ జోరు కొనసాగుతోంది.

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ‘గుంటూరు కారం’.

ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట మరో సారి గుంటూరోణ్ణి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

ఎస్ ! గుంటూరు కారం.. రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.

ఈ సినిమా మొత్తం  159 నిమిషాలు అంటే 2 గంటల 39 నిమిషాలు ఉంటుందట.

అయితే అందులో చివరి 45 నిమిషాలు బాబు సిల్వర్ స్క్రీన్‌ పై బీభత్సం చేస్తాడనే హింట్ ఇచ్చేశాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ.

దీంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.