25 December 2023

ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్

TV9 Telugu

మన్సూర్ అలీఖన్ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

త్రిషపై ఆయన చేసిన కామెంట్స్.. చిరు, ఖుష్బూతో సహా చాలా మంది సెలబ్రిటీలకు ఆయనపై కోసం వచ్చేలా చేసింది.

ఆ తర్వాత వారిపై ఈయన ఎదురు దాడికి దిగడం.. కోర్టులో పరువు నష్టం దావా వేయడం.. సెన్సేషనల్ అయింది.

అయితే ఇదే కేసు అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూ అయి.. ఇప్పటికి ఎండ్ అయింది.

చిరు, త్రిష, ఖుష్బూ నుంచి తలో కోటి వసూలు చేసి.. తన పరువను పోయినందుకు గాను... ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను  చెన్నై కోర్టు తిప్పికొట్టింది.

సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని హైకోర్టు మన్సూర్ ను ఆదేశించింది.

అయితే ఈ తీర్పు నెట్టింట వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఈయనను ఈసారి గట్టిగా పడిందిగా.. పాపం మన్సూర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.