‘మా ఊరి పొలిమేర-2’ టీజర్ వచ్చేసింది..

రేణుక అవతారం చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’.

సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో ఓటీటీలో విడుదలైంది ఈ చిత్రం.

ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర-2’ రూపొందుతుంది.

అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరికృష్ణ నిర్మిస్తున్నారు.

తాజాగా శుక్రవారం హీరో వరుణ్‌ తేజ్‌ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఆసక్తికరంగా ఉంది.

ఈ భాగంలో పద్మనాభ స్వామి గుడి అంశాన్ని కూడా టచ్‌ చేసే ప్రయత్నం చేశామని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.