ఖుషి టు గదర్ 2.. తాజా సినిమా ముచ్చట్లు ఇవే..

04 September 2023

విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఖుషి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది.

ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే 50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా యాత్ర 2 మూవీలో మరోసారి రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించబోతున్నారట మమ్ముట్టి.

తనకు అవార్డుల విషయంలో అస్సలు ఇంట్రస్ట్ లేదన్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌. ఒకవేళ అవార్డులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తానని చెప్పారు.

జయం రవి, నయనతార జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇరైవన్‌. ఐ. అహ్మద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసిన మేకర్స్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ బోస్‌, ఆశిష్ విద్యార్థి, నరేన్‌ కీలక పాత్రల్లో నటించారు.

గదర్ 2 సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హీరో సన్నిడియోల్. 23 ఏళ్ల తరువాత వచ్చి న సీక్వెల్‌తో బాలీవుడ్ రికార్డ్‌లు తిరగరాస్తున్నారు సన్ని.

ఆనందాన్ని పంచుకుంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు సన్నిడియోల్‌. ఈ పార్టీలో గదర్ టీమ్‌తో పాటు షారూఖ్, సల్మాన్, ఆమిర్‌ కూడా పాల్గొన్నారు.