గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్‌.. యానిమల్ సక్సెస్‌ పార్టీ..

TV9 Telugu

08 January 2024

ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వాయిదా పడటంతో ట్రైలర్‌ను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది గుంటూరు కారం టీమ్‌.

నిన్న (ఆదివారం) 5 గంటలకు సాయంత్రం సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు మూవీ మేకర్స్.

ఆ వెంటనే యూట్యూబ్‌లోనూ విడుదల చేసింది చిత్రబృందం. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర దర్శకుడు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రీసెంట్‌ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్‌ సక్సెస్‌ పార్టీ ముంబైలో ఘనంగా జరిగింది.

ఈ సక్సెస్‌ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కొంతమంది పాల్గొన్నారు.

రణబీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్.

డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని పార్ట్ 2 కూడా ఉంది.