ఇంతటి అందాన్ని హత్తుకున్న ఆ చీరకి విలువ కట్టగలమా..

28 October 2023

2014లో సుకుమార్ దర్శకత్వం మహేష్ బాబు 1: నేనొక్కడినే అనే తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది ముద్దుగమ్మా కృతి సనాన్.

అదే ఏడాది హీరో పంత్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి. ఈ చిత్రంలో ఆమె నటనకి నాలుగు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డులు అందుకుంది.

2015లో నాగ చైతన్య హీరోగా వచ్చిన దోచెయ్ చిత్రంలో కథానాయకిగా కనిపించింది ఈ అందాల భామ. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ కథానాయకిగా ఎదిగింది ముద్దుగుమ్మ కృతి సనాన్.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రామాయణం ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ చిత్రంతో తెలుగులో కనిపించింది. ప్రభాస్ రాఘవుడిగా కనిపించిన ఈ చిత్రంలో జానకిగా నటించింది.

తాజాగా టైగర్ ష్రాఫ్ పక్కన హీరోయిన్ గా గణపత్ అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అందాలతార. ఈ చిత్రం టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు.

ఈ సినిమాతో పాటు ది క్రూ, దో పట్టి అనే రెండు బాలీవుడ్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించనుంది ఈ వయ్యారి భామ.