కృతి సనన్ అందాలకు దాసోహం కానీ కుర్రకారు ఉంటారా ??

Phani CH

04 October 2024

కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ చిన్నది పేరుకు బాలీవుడ్ భామ అయిన టాలీవుడ్ సినీమాతోనే నట ప్రస్థానం మొదలు పెట్టింది

ఈ ముద్దుగుమ్మ  ఢిల్లీలో పుట్టి పెరగగా మ‌హేష్ బాబు హీరోగా నటించిన నేనొక్క‌డినే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

తరువాత తెలుగులో నాగ చైత‌న్యకు జోడిగా దోచెయ్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి. 

ఆ తర్వాత తెలుగు హీరో ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఆదిపురుష్ మూవీలో నటించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇలా వరుస డిజాస్టర్స్ తో తెలుగులో హీరోల పాలిట ఐరన్ లెగ్ గా మారిందనే కామెంట్స్ వినిపించాయి. టాలీవుడ్  లో నటించిన సినిమాలు ఏవి వర్కౌట్ కాలేదు.

కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్ లోనే 2021 యేడాదికి గాను నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచింది కృతి సనన్.

ఈ ముద్దుగుమ్మ ముంబైలోని బాంద్రాలో రూ.35 కోట్లతో 4 BHK అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటుంది.