06 July 2024

అరెరే..ఇట్టా మారిపోయిందేంటీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. తొలి సినిమాతోనే యువతలో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. తనే శ్వేత బసు ప్రసాద్. 

వరుణ్ సందేశ్ నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్‏గా పరిచయమై మొదటి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. 

కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కెరీర్‏లో నిలదొక్కుకోవడంలోనూ విఫలమయ్యింది శ్వేత. 

ఆ తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దూరమయ్యాయి. ఇతర భాషలలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆఫర్స్ దక్కించుకుంది. 

కానీ అక్కడ కూడా ఈ అమ్మడుకు ఆశించినంత క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది శ్వేత బసు ప్రసాద్.

చాలా కాలం సైలెంట్ అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతతో ఫోటోస్ షేర్ చేస్తుంది. 

ఇప్పుడిప్పుడే పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్న శ్వేత.. ఇటు నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. బొద్దుగా ఉండే అమ్మాయి ఇలా మారిపోయిందేంటీ అంటూ షాకవుతున్నారు.