26 September 2025

సీరియల్ బ్యూటీ క్రేజ్.. దెబ్బకు రికార్డ్స్ బ్రేక్.. 24 ఏళ్లకే..

Rajitha Chanti

Pic credit - Instagram

సినిమా పరిశ్రమ కాదు.. సీరియల్ నటీనటులకు సైతం విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతిరోజూ వచ్చే సీరియల్స్ చూసే అడియన్స్ చాలా మంది ఉంటారు. 

అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ ముద్దుగుమ్మ బుల్లితెరపై సత్తా చాటుతుంది. 23 ఏళ్ల వయసులోనే దాదాపు 250 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది. 

ఆమె పేరు జన్నత్ జుబైర్. బుల్లితెరపై ఫేమస్ నటి. అనేక సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఒక్కో ఎపిసోడ్ కు రూ.18 లక్షలు తీసుకుంటుంది. 

ముంబైలో జన్మించిన ఆమె ఎప్పుడూ సినిమాల్లో నటించాలని కలలు కనేది. కళాశాల చదువులు పూర్తి చేసిన తర్వాత, ఆమె మోడలింగ్ రంగంలోకి వచ్చింది. 

2007 నుండి 2010 వరకు స్టార్ వన్‌లో ప్రసారమైన దిల్ మిల్ గయేలో నటి జన్నత్ జుబైర్ రెహమానీ తమన్నా చెల్లెలి పాత్రను పోషించింది .

ఆ తర్వాత హిందీలో అనేక సీరియల్స్ చేసింది. అంతేకాకుండా రహమానీ, రాణి ముఖర్జీ నటించిన 'హిచ్కీ' చిత్రంలో కూడా జన్నత్ జుబేర్ నటించారు.

జన్నత్ 'ఖత్రోన్ కే ఖిలాడి' అనే టీవీ షోలో పాల్గొన్నందుకు ఎపిసోడ్‌కు రూ. 18 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. 

అలాగే 'నావ్వు చెఫ్' ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు, సోషల్ మీడియాలో ప్రతి పోస్ట్‌కు రూ. 1.5 నుండి రూ. 2 లక్షలు అందుకుంటుందని సినీ వర్గాలు తెలిపాయి.