06 July 2025

4 నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. 900 కోట్లు..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుమీదున్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

కేవలం నాలుగు నెలల్లోనే మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేసింది. అంతేకాకుండా రూ.900 కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు లక్కీ బ్యూటీగా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఇటీవలే ఆమె నటించిన సినిమా రూ.300 కోట్లు రాబట్టింది. 

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇటీవలే ముగ్గురు స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుని జోష్ మీదుంది. 

విజయ్ దళపతి హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన గోట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కోట్లు వసూలు చేసింది. 

ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. 

అలాగే ఇటీవలే వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా రాబట్టిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే నెట్టింట క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది మీనాక్షి.