05 February 2025

3 సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో మొదటి సినిమా చేస్తుంది. 

తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. 

అంతేకాదు..మూడు సినిమాలు వరుసగా రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఇప్పటివరకు ఆమె నటించిన మూడు సినిమాలో థియేటర్లలో విడుదలై రూ.100 కోట్లు రాబట్టాయి. ఆమె మరెవరో కాదు మాళవిక మోహనన్. 

కేరళలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మలయాళంతోపాటు తమిళంలోనూ ఆఫర్స్ అందుకుంది. రజినీతో కలిసి పేట సినిమాతో పరిచయమైంది. 

ఆ తర్వాత విజయ్ దళపతి సరసన మాస్టర్ చిత్రంలో కనిపించింది. అలాగే తమిళ్ స్టార్ హీరో ధనుష్ జోడిగా మారన్ చిత్రంలో నటించింది. 

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తమిళంలో మాళవిక నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.