12 November 2025

9 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. ప్రభాస్, పవన్ కళ్యాణ్‏తో ఆఫర్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

 సినీరంగంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హిట్టు కొట్టాల్సిందే. 

అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ హిట్టు కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అంతే. 

ఆమె మరెవరో కాదు నిధి అగర్వాల్.  'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఆ తర్వాత  నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సైతం నిరాశే మిగిల్చింది. కానీ తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. 

మిస్టర్ మజ్ను, భూమి, హీరో వంటి సినిమాలతో అలరించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాయి. రామ్ పోతినేతితో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టైంది. 

నిధి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు ఈ మూవీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాలో నటించింది. ఇటీవలే ఈ మూవీ విడుదలైంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు.. తెలుగులో నిధి అగర్వాల్ కు స్టార్ హీరోలతో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం రాజాసాబ్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.