17 February 2025

ఈ హీరోయిన్ వయసు 27 ఏళ్లే.. 65 కోట్ల బంగ్లా.. వేల కోట్ల ఆస్తి..

Rajitha Chanti

Pic credit - Instagram

ఆమె వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు మాత్రమే. కానీ 65 కోట్ల ఇల్లు, వేల కోట్ల ఆస్తికి వారసురాలు. ఈ హీరోయిన్ వేరేలెవల్ క్రేజ్.

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియాను ఏలేస్తుంది ఈ బ్యూటీ. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. 

ధడక్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

జాన్వీ కపూర్ ఇప్పుడు ముంబైలోని బాంద్రాలో రూ.65 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తుంది. 8669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉంది. 

అలాగే జాన్వీ చెన్నైలో మరో విలాసవంతమైన భవనం ఉంది. 4 ఎకరాలలో ఉన్న ఈ భవనాన్ని అప్పట్లో శ్రీదేవి కొనుగోలు చేసినట్లు సమాచారం. 

జాన్వీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె వద్ద మెర్సిడెస్ మే బ్యాక్ S560 కారు సైతం ఉన్న సంగతి తెలిసిందే.