ఎన్నో అవమానాలు దాటి.. ఒక్క పాత్రతో సంచలనం సృష్టించిన  నటి 

Phani.ch

20 May 2024

సినిమాల మీద మక్కువతో చాలామంది ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నటారు.. కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పిస్తారు.

తర్వాత పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంటారు నటీనటులు.. అలాంటి వారిలో ఒకరు సంజీదా షేక్.

ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేదు. సంజీదా కెరీర్ ప్రారంభంలో యాడ్స్‌లో నటించింది.

తర్వాత కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా హిట్ కాలేదు. అయితే ‘క్యా హోగా నిమ్మో కా’ టీవీ షోలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత సంజీదా ఏక్ హసీనా థీ, ఇష్క్ కా రంగ్ సఫేద్, నాగిన్ 3 హిట్ సీరియల్స్‌లో నటించింది. తైష్, కాళీ ఖుహి సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించింది.

అయితే ఇండస్ట్రీకి పరిచయమైన 21 ఏళ్లకు, 2024లో సంజీదా నటించిన ఒక సినిమా, సిరీస్ సూపర్ హిట్ అయ్యాయి.

ఆ సిరీస్ మరేదో కాదు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొట్టమొదటి వెబ్‌సిరీస్ ‘హీరామండి: ద డైమండ్ బజార్’ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది ఈ సిరీస్.

దీంట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ ప్రదాన పాత్రల్లో నటించి మెప్పించారు.

అయితే మరో నటి సంజీదా షేక్‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. అద్భుతమైన నటనతో ఆమె ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది.