TV9 Telugu

ఓవర్ నైట్ క్రేజ్ అంటే ఇదేనేమో. క్యూ కట్టిన ఆఫర్లు.. ఇంతకు ఎవరు ఈ భామ.!

12 April 2024

విజయ్ దేవరకొండ - గౌతమ్ చిత్రంలో న్యూ ట్రేండింగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యినట్టే.

పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‍గా బాగా పాపులర్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ మధ్యే సినీరంగ ప్రవేశం చేసారు.

క్యాట్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు. యారియాన్ 2 అనే బాలీవుడ్ చిత్రంతో భాగ్యశ్రీ తెరంగేట్రం చేశారు.

ఇక సోషల్ మీడియాలోను ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. ఈమె ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి.

కొత్త కొత్త ఫోటోషూట్స్ తో., అదిరిపోయే గ్లామర్ డోస్ తో యూత్ ని గట్టిగానే ఆకట్టుకుంది ఈ భాగ్యశ్రీ బోర్సే.

ప్రస్తుతం హరీశ్ శంకర్ - రవితేజ కాంబోలో వస్తున్నా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నే హీరోయిన్‍.

ఇక ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు ఈ భాగ్యశ్రీ బోర్సే.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 లో ముందు హీరోయిన్ మమితా బైజూ పేరు వినిపించినప్పటికీ భాగ్యశ్రీ బోర్సే ఫైనల్ చేసారని టాక్.