18 February 2025

చేసింది 3 సినిమలు.. 1600 కోట్లు కలెక్ట్ చేసిన హీరోయిన్.. చివరకు..

Rajitha Chanti

Pic credit - Instagram

కేవలం మూడు సినిమలా్లో నటించి పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన చిత్రాలు రూ.1600 కోట్లు రాబట్టాయి.

మోడల్‏గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్‏గా ఫేమస్ అయ్యింది. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? 

తనే శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచమయైంది. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. 

2012లో, శ్రీనిధి శెట్టి 'క్లీన్ అండ్ క్లియర్' స్పాన్సర్ చేసిన ఫ్రెష్ ఫేస్ పోటీలో పాల్గొని టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఎంపికైంది ఈ అమ్మడు. 

 2015లో మణప్పురం మిస్ సౌత్ ఇండియాలో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను గెలుచుకుంది. మణప్పురం క్వీన్ ఆఫ్ ఇండియా రన్నరప్ అయ్యింది. 

2018లో ఆమె మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనల్స్‌కు ఎంపికైంది. మిస్ సుప్రనేషన్ ఇండియా 2016 టైటిల్ గెలుచుకుంది. ప్రతి అందాల పోటీలో గెలిచింది. 

2018లో కేజీఎఫ్ సినిమాతో నటిగా మారింది. రూ. 80 కోట్లతో నిర్మించిన సినిమా రూ.250 కోట్లు రాబట్టింది. ఆ సినిమాకు కోటి తీసుకుంది. 

కేజీఎఫ్ 2 కోసం రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతోపాటు ఆమె నటించిన కోబ్రా సినిమాలన్నీ కలిపి రూ.1600 కోట్లు రాబట్టాయి.