సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టనున్న  కియారా అద్వానీ ..

TV9 Telugu

20 August 2024

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. చేసింది రెండు సినిమాలే అయినా భారీ క్రేజ్ తెచ్చుకుంది. 

మహేష్ బాబు హీరోగానటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. 

ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అలాగే పలు యాడ్స్ లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. 

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న కియారా అద్వానీ ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి వస్తోంది. మరోసారి రామ్ చరణ్ తో జతకడుతోంది. 

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ సినిమాలో ఈ చిన్నది నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

గేమ్ చెంజర్ సినిమా తర్వాత కియారా తిరిగి టాలీవుడ్ లో సినిమాలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ అమ్మడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తుందట.