26 November 2023

హీరోయిన్  త్రిష కారణంగా.. చిక్కుల్లోపడ్డ ఖుష్బూ..

నిన్న మొన్నటి వరకు త్రిష Vs మన్సూర్ మధ్య జరిగిన వివాదం తాజాగా ముగిసిపోయింది. 

మన్సూర్ అలీఖాన్ సారీ చెప్పడం.. త్రిష యాక్సెప్ట్ చేయడంతో.. ఈ వివాదం సమసి పోయింది. 

కానీ మన్సూర్కు వ్యతిరేకంగా.. ఖుష్బూ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో నెట్టేసింది.

మన్సూర్‌పై ఫైర్ అవుతూ.. 'మీలా లోకల్‌ భాష మాట్లాడలేను అంటూ' ఖుష్బూ చేసిన కామెంట్ చేశారు.

అయితే తాజాగా ఈ కామెంట్స్‌ పై కొంత మంది దళిత నాయకులు సీరియస్ అయ్యారు. 

తమ భాషను కించపరిచారంటూ.. ఆమెపై అట్రాసిటీ చట్టం కింద చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే ఈన్యూస్ కాస్తా బయటికి రావడంతో.. కోలీవుడ్‌ సర్కిల్లో వైరల్ అవుతోంది.