హాట్ టాపిక్‌గా మారిన కీర్తి సురేష్ షాకింగ్ రెమ్యునరేషన్

TV9 Telugu

05 March 2024

కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డును అందుకుంది.

‘మహానటి’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సరసన ‘సర్కారు వారి పాట లో నటించి బాస్టర్ హిట్ అందుకుంది.

టాలీవుడ్, కోలీవుడ్  లో కీర్తి సురేష్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

తేరీ రీమేక్ తో వస్తున్న ‘బేబీ జాన్’ తో హిందీలో అడుగుపెట్టబోతోంది కీర్తి సురేష్.  షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

అయితే కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా  మారింది.

బేబీ జాన్ కోసం రూ.4 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు తీసుకోగా.. కీర్తి పారితోషికాన్ని డబుల్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.