అందనికి ఈ బ్యూటీని చుస్తే అసూయా.. తనకంటే మెరిసిపోతుందని.. 

TV9 Telugu

20 April 2024

తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తర్వాత నాచురల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో కథానాయకిగా అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మహానటి అనే తెలుగు చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది. ఈ చిత్రంతో నేటితరం మహానటి అయిపొయింది.

2022లో మహేష్ బాబుకి జోడిగా సర్కార్ వారి పాట చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

2023లో దసరా చిత్రంలో మొదటిసారి పూర్తి డిగ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి పాన్ ఇండియా హిట్ అందుకుంది.

తెలుగు సినిమాల్లో కొద్దీ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానన్నీ సంపాదించింది ఈ వయ్యారి భామ.

2013లో నవంబర్ 14న వచ్చిన మలయాళీ హార్రర్ సినిమా గీతాంజలిలో తొలిసారి హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ.

మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పైలట్స్, అచనేయనేనికిష్టం, కుబేరన్ వంటి చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి భామ.