30 November 2023

ఓటీటీ తీరుపై సీరియస్ అయిన కాంతార డైరెక్టర్

కాంతారతో.. ఒక్క సారిగా త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన రిషబ్ షెట్టి.. తాజాగా ఎమోషనల్ అయ్యారు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడిన ఆయన కన్నడ సినిమాలకు... ఓటీటీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు.

ఒకప్పుడు NFDC ఫిల్మ్ బజార్ లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతేనే కన్నడ చిత్రాలకు మంచి రెవెన్యూ వచ్చేది చెప్పిన రిషబ్ షెట్టి.

కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా.. సక్సెస్ కానట్టైతే ఓటీటీ సంస్థలు ఆ సినిమాను పక్కకు పెట్టేస్తున్నాయన్నారు.

 ఇది చాలా బాధాకరం అంటూ సీరియస్‌ కామెంట్స్ చేశారు రిషబ్ షెట్టి.

అంతేకాదు కాంతార సక్సెస్ తర్వాత ఇతర సినీ పరిశ్రమల నుంచి తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు రిషబ్ షెట్టి. కానీ తాను వాటిని ఒప్పుకోలేదన్నారు.

కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూస్తారని..చెప్పారు.