ఆరోజునే ప్రేక్షకుల ముందుకు కంగనా ‘ఎమర్జెన్సీ’..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ.

ఈ చిత్రం ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనుంది.

కంగనా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది.

తాజాగా ఈ చిత్రం విడుదల ప్రకటించింది చిత్రబృందం.

ఈ మేరకు ఈ చిత్రం నుంచి టీజర్‌ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ టీజర్‌ ద్వారా ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానున్నట్లు తెలిపారు.

దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి గుర్తుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.

ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ జయప్రకాష్ నారాయణ్ పాత్రలో నటిస్తున్నారు.