కొత్త చిత్రాన్ని ప్రకటించిన కంగనా..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలియని వారుండరు.

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉంటోంది ఈ భామ.

ప్రస్తుతం ఈమె నటిస్తోన్న ఎమర్జెన్సీ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

ఇదిలా ఉంటే తన తర్వాతి చిత్రం గురించి ఓ అప్డేట్ ఇచ్చింది కంగనా.

నిర్మాత సందీప్‌ సింగ్‌తో కలిసి త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు తెలిపింది.

‘నేను, సందీప్‌ 13 సంవత్సరాలకి పైగా స్నేహితులం. చాలా కాలంగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాము.

ఇప్పుడు సరైన కథ, పాత్ర దొరికినందుకు అందరం సిద్ధంగా ఉన్నాము’ అని కామెంట్ జోడించింది.

‘కంగనా నటనా నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడం సవాలుతో కూడిన పని.

ఇప్పుడు ఆమె మాత్రమే చేయగల కథ నా దగ్గర ఉంది’ అని తెలిపారు నిర్మాత సందీప్‌ సింగ్‌.