15 December 2023

Pic credit - Instagram

ఆ సమయంలో అమ్మను కావాలనే దూరం పెట్టాను.. జాన్వీ కపూర్.. 

దివంగత హీరోయిన్ శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమై.. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటున్నారు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ  మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి కుమార్తె అయిన కారణంగా అభద్రతా భావానికి గురైనట్లు చెప్పుకొచ్చింది. 

శ్రీదేవి కుమార్తె కావడంతోనే తనకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారని.. అందుకే తన తల్లిని కెరీర్ ప్రారంభమైన సమయంలో దూరం పెట్టానని తెలిపారు. 

తన తల్లి నుంచి ఎలాంటి సాయం తీసుకోవద్దని అనుకున్నానని.. ఆమెలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించానని.. ఫస్ట్ సినిమా సెట్‏కు రావొద్దని చెప్పిందట. 

ఆమె కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమవ్వడంతో ఎందుకో అభద్రతా భావానికి లోనయ్యేదానని అని.. అందుకే ఆమె సలహాలు కూడా తీసుకునేదాన్ని కాదని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. 

కానీ ఇప్పుడు ప్రతి విషయం తన తల్లితో చెప్పాలనిపిస్తుందని.. అమ్మా.. షూట్ ఉంది. త్వరగా రా అని ఆమెతో చెప్పినట్లు అనిపిస్తుందని.. తన కూతురు అయినందుకు గర్వంగా ఉందని తెలిపింది. 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అని అభిమానులు అంటుంటే ఆనందంగా ఉందని చెబుతూ భావోద్వేగానికి గురైంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఎన్టీఆర్ జోడిగా దేవర సినిమాలో నటిస్తుంది.