10 May 2025
దశాబ్దాల బాధకు ఇది సమాధానం.. అది నన్ను బాధిస్తోంది.. జాన్వీ కపూర్..
Rajitha Chanti
Pic credit - Instagram
జమ్మూపై దాడులకు సంబంధించిన విజువల్స్ చూసి దిగ్ర్భాంతికి గురైనట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ తన ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు.
ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని ఆందోళన.. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం.
కానీ ఇప్పుడు పరిస్థితి మనవరకు వచ్చింది. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వదు. దశాబ్దాలుగా ఇలాండి దాడులు చాలా ఎదుర్కొన్నాం.
కానీ ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది భారత్. మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సరైన సమాధానం ఇదే.
మన సైనికులు శత్రుదేశంపై వీరోచిత పోరాటం చేస్తున్నాయి. మనల్ని, మన భూమిని, మన సార్వభౌమత్వాన్ని మన సైనికులు రక్షిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా ఉంటూ వారికి మద్దతు ఇద్దాం. దాయది దేశం అరాచకత్వాన్ని ఇక పై చూసీచూడనట్లు ఉండేది లేదు.
మనం కూడా గట్టిగానే బదులిస్తామని వారికి తెలిసొచ్చేలా చేద్ధాం. ఈ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తుంది.
త్వరలోనే ఈ పరిస్థితికి శాశ్వాతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసం ప్రార్థిస్తుంటాను అంటూ జాన్వీ కపూర్ రాసుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్