28 September 2024

తంగం పాత్రలో జాన్వీ.. యాక్టింగ్ చూసి బాయ్‏ఫ్రెండ్ ఫిదా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. 

మొదటి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యా్ప్తంగా తొలిరోజే ఈ మూవీ రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. 

ఈ సినిమాలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు ఎన్టీఆర్. అలాగే మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది జాన్వీ. 

తాజాగా జాన్వీ కపూర్ యాక్టింగ్ పై ఆమె బాయ్ ఫ్రెండ్  శిఖర్ పహరియా రియాక్ట్ అవుతూ తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. 

దేవర సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫోటో షేర్ చేస్తూ నేనేమైనా కలలో ఉన్నానా ? అంటూ కామెంట్ చేశారు శిఖర్ పహరియా. 

ప్రస్తుతం శిఖర్ పోస్ట్ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు. 

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో  ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. 

బీటౌన్ లో జరిగే పార్టీలతోపాటు తిరుమలకు కూడా శిఖర్, జాన్వీ కలిసి వెళ్లారు. అలాగే శిఖర్ పేరుతో జాన్వీ నెక్షన్ కూడా ధరించింది.