చందమామలో వెలుగు.. హంసలో సొగసు కలిపితే ఈ వయ్యారి రూపం.. 

TV9 Telugu

23 January 2024

8 మే 1995న తమిళనాడు రాష్ట్రంలోని కావేరి తీర ప్రాంతం ఈరోడ్ లో పుట్టి పెరిగింది వయ్యారి భామ ఐశ్వర్య మీనన్.

ఈమె కుటుంబం కేరళ రాష్ట్రంలోని చెందమంగళానికి చెందినది. వృత్తి పరంగా తమిళనాడుకి చేరుకుంది ఈ బ్యూటీ ఫ్యామిలీ.

ఈరోడ్‌లోని భారతి విద్యాభవన్, వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ బ్యూటీ.

చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

2012లో తమిళ టీవీ సీరియల్ ‘తేండ్రల్’లో ​​శృతి పాత్రను పోషించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషల చిత్రాల్లో కథానాయకిగా లీడ్ రోల్స్ చేసింది ఈ వయ్యారి భామ.

2023లో నిఖిల్ సరసన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ రెవీల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దింతో ఈమె తెలుగు డెబ్యూ నిరాశ మిగిల్చింది.