లంగా వోణిలో అందాన్నే ఆకట్టుకునేలా చేస్తోన్న ఐశ్వర్య..

31 October 2023

8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది ఐశ్వర్య మీనన్. ఆమె కుటుంబం కేరళలోని చెందమంగళానికి చెందినది.

ఈరోడ్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఈరోడ్‌లోని వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది.

SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ.

ప్రధానంగా తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో చిత్రాలలో ఎక్కువగా కథానాయకిగా నటిస్తుంది ఈ వయ్యారి భామ.

2012లో కాదలిల్ సోదప్పువదు యెప్పడి (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) అనే తమిళ చిత్రంలతో సినీ అరంగేట్రం చేసింది.

తర్వాత 2013లో వచ్చిన ఆపిల్ పెన్నే అనే తమిళ మూవీ ద్వారా కథానాయకిగా వెండి తెరకు పరిచయం అయింది ఈ అందాల భామ.

తరవాత కొన్ని హిట్ తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాలతో కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చికుంది ఈ వయ్యారి.

2023లో యోంగ్ హీరో నిఖిల్ కి జోడిగా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.